RCB Victory Parade: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. బెంగళూరులో భారీ విన్నింగ్ ర్యాలీ

RCB Victory Parade: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. బెంగళూరులో భారీ విన్నింగ్ ర్యాలీ

RCB Victory Parade:ఐపీఎల్ 2025 విన్నింగ్ ట్రీట్‌ను ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడానికి జూన్ 4న బెంగళూరులో గ్రాండ్ విక్టరీ పరేడ్ ఉంటుందని కోహ్లీ అనౌన్స్ చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు ఫస్ట్ IPL ట్రోఫీ గెలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది. దీంతో 18 ఏళ్ల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఈ స్పెషల్ మూమెంట్‌లో, RCBకి అన్నీ తానై నిలిచిన విరాట్ కోహ్లీ.. లాస్ట్ బాల్ పడకముందే ఆనందంతో ఎమోషనల్ అయ్యాడు. గెలుపు తర్వాత, ఈ హిస్టారిక్ విన్‌ను ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడానికి జూన్ 4న బెంగళూరులో గ్రాండ్ విక్టరీ పరేడ్ ఉంటుందని కోహ్లీ అనౌన్స్ చేశాడు.

18 ఏళ్ల కల నిజమైన వేళ
ఫైనల్ తర్వాత జియోస్టార్‌తో మాట్లాడిన కోహ్లీ, బెంగళూరు ఫ్యాన్స్‌కు ఇంతకు ముందెన్నడూ చూడని రేంజ్‌లో పార్టీ ఉంటుందని ప్రామిస్ చేశాడు. నేడు అంటే జూన్ 4, బుధవారం టీమ్ హోమ్ గ్రౌండ్‌కు వస్తుందని, మంచి టైమ్ అయినా, బ్యాడ్ టైమ్ అయినా అండగా నిలిచిన RCB సపోర్టర్స్ కోసం స్పెషల్ పరేడ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. “ఇది చాలా స్పెషల్‌గా ఉండబోతోంది, హిస్టరీ క్రియేట్ చేస్తుంది” అని కోహ్లీ ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌తో చెబుతూ, ఈ సెలబ్రేషన్స్‌లో జాయిన్ అవ్వాలని RCB లెజెండ్స్ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను కూడా పిలిచాడు.

ఫ్యాన్స్‌తో కోహ్లీ బాండింగ్
కోహ్లీ ఎమోషన్ చూస్తే ఫ్యాన్స్‌తో తనకు ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ల లాయల్టీకి తిరుగులేదని, సరిగ్గా ఆ లవ్ కోసమే తాను 18 సీజన్లుగా RCBతోనే ఉన్నానని చెప్పాడు. టీమ్ ఓడినా, గెలిచినా ప్రతీ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియానికి ఫ్యాన్స్ వచ్చేశారని గుర్తుచేసుకున్నాడు. “ఇంత గట్టి సపోర్ట్‌ని నేను ఎక్కడా చూడలేదు. ఈ విన్ మాకంటే ఎక్కువగా వాళ్లదే,” అని కోహ్లీ అన్నాడు. ఏళ్ల తరబడి ట్రోల్స్, సెట్‌బ్యాక్స్ వచ్చినా సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పాడు.

ట్రోల్స్ టు విన్
RCB జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్నేళ్లుగా టీమ్‌పై వచ్చిన కామెంట్స్, జోక్స్‌ను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. కానీ ఆ కష్టాలే ఫ్యాన్స్‌తో తమ బాండింగ్‌ను మరింత స్ట్రాంగ్ చేసిందని నమ్ముతున్నాడు. “మేం చాలా టఫ్ టైమ్స్ చూశాం, కానీ అవే మమ్మల్ని ఒక టీమ్‌గా, ఒక ఫ్యామిలీగా మరింత దగ్గర చేశాయి,” అని కోహ్లీ చెప్పాడు. ఏళ్ల తరబడి ఉన్న టెన్షన్, హార్ట్‌బ్రేక్స్ తర్వాత ఈ విన్ తనకు ఫుల్ రిలీఫ్ ఇచ్చిందన్నాడు.

లెజెండ్స్ మీట్
విన్ అయిన వెంటనే, కోహ్లీ గ్రౌండ్‌లో AB డివిలియర్స్, క్రిస్ గేల్‌లను ఆనందంతో హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత, తన వైఫ్ అనుష్క శర్మతో కొన్ని స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసుకున్నాడు. క్రిస్ గేల్ కూడా పరేడ్ గురించి మాట్లాడుతూ, “బెంగళూరు సిటీ మా కోసం వెయిట్ చేస్తోంది. నేను వీడియోలు చూశాను. అంతా ఫైర్‌వర్క్సే. సిటీ మొత్తం పండగ చేసుకుంటోంది” అన్నాడు.

RCB హిస్టారిక్ విన్
ఫైనల్‌లో, విరాట్ కోహ్లీ కూల్‌గా ఆడి 43 రన్స్ చేసి RCB టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమ్ మొత్తం 190 రన్స్‌‌ భారీ స్కోర్ కొట్టింది. తర్వాత, కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బౌలర్లు బాగా బౌలింగ్ చేసి, ప్రెజర్‌ను హ్యాండిల్ చేసి ఆ టోటల్‌ను డిఫెండ్ చేశారు. ఈ సీజన్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌లలో 657 రన్స్ చేసి, తానెంత గ్రేట్ ప్లేయరో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

బెంగళూరులో తొక్కిసలాట.. 11 మంది మృతి! RCBపై BCCI సీరియస్‌

బెంగళూరులో తొక్కిసలాట.. 11 మంది మృతి! RCBపై BCCI సీరియస్‌

ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా, RCB మేనేజ్‌మెంట్‌పై వేడుకలను సరిగ్గా ప్లాన్ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్‌ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందించింది. సెలబ్రేషన్స్‌ను సరిగ్గా ప్లాన్‌ చేసి ఉండాల్సింది అంటూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం (జూన్ 4) బెంగళూరు నగరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసి ఉండాల్సిందని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు. సన్నాహక లోపాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడటానికి దారితీసిన ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. 18 సంవత్సరాల తర్వాత RCB తొలిసారిగా IPL గెలిచినందున బెంగళూరులో ఇది చిరస్మరణీయమైన రోజుగా భావించారు, కానీ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి.

ఛాంపియన్ జట్టును చూసేందుకు చిన్నస్వామి స్టేడియం వెలుపల దాదాపు 2 లక్షల మంది అభిమానులు గుమ్మిగూడారు. పోలీసులు భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. “ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారు. నిర్వాహకులు దీన్ని బాగా ప్లాన్ చేసి ఉండాలి. మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని సైకియా తెలిపారు. “ఇంత పెద్ద విజయోత్సవ వేడుకను నిర్వహించేటప్పుడు, సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ ఇంత అద్భుతంగా ముగిసిన తర్వాత, ఇది యాంటీ-క్లైమాక్స్” అని ఆయన అన్నారు.

గత సంవత్సరం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలో బీసీసీఐ నిర్వహించిన ఓపెన్ బస్ పరేడ్‌ను దేవజిత్ సైకియా ఉదహరించారు . ముంబైలో ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా ప్లాన్ చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టును స్వాగతించడానికి ముంబైలో భారీ సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ఆటగాళ్లను సత్కరించిన వాంఖడే స్టేడియం కూడా కిక్కిరిసిపోయింది. అయితే, ఈ కార్యక్రమం సరిగ్గా ప్లాన్ చేశారు. అందుకే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని అన్నారు.

వైభవ్‌ సూర్యవన్షీ ఏ స్కూల్‌లో ఎంత ఫీజ్‌ కట్టి చదువుతున్నాడో తెలుసా? ఐపీఎల్‌ అవ్వగానే.. బ్యాక్‌ టూ స్కూల్‌

వైభవ్‌ సూర్యవన్షీ ఏ స్కూల్‌లో ఎంత ఫీజ్‌ కట్టి చదువుతున్నాడో తెలుసా? ఐపీఎల్‌ అవ్వగానే.. బ్యాక్‌ టూ స్కూల్‌

వైభవ్ సూర్యవన్షీ, 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి సెన్సేషన్‌గా మారాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలోని ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అతని స్కూల్ ఫీజు, క్రికెట్ శిక్షణ, అతని అద్భుతమైన క్రికెట్ ప్రయాణం గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

వైభవ్‌ సూర్యవన్షీ.. ప్రస్తుతం ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్‌ ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్‌. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ ఆడటమే కాకుండా.. 35 బంతుల్లోనే సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. అసలు భయమంటేనే ఏంటో తెలియకుండా బ్యాటింగ్‌ చేస్తూ.. భవిష్యత్తు నాదే అంటూ గర్వంగా చెప్పకనే చెబుతున్నాడు. ఐపీఎల్‌ 2025 కోసం జరిగిన మెగా వేలంలో కోటి 10 లక్షలకు ఈ కుర్రాడిని రాజస్థాన్‌ రాయల్స్‌ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాకపోయినా.. ఒక్కసారి ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాకా.. తన సత్తా ఏంటో చూపించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు.

ఆ తర్వాత తన మూడవ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఇండియన్‌ ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. తాజాగా ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే.. ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న ఈ కుర్రాడు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడని తెలిసి అంతా షాక్‌ అయ్యారు. ఇంతకీ వైభవ్‌ సూర్యవన్షీ ఏ స్కూల్‌లో చదువుతున్నాడు? ఎంత ఫీజ్‌ కడుతున్నాడు? అనే ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వైభవ్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామంలోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

అంజలి కేవత్ ముక్తేశ్వర్ సిన్హా మాడెస్టీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వైభవ్ 9 ఏళ్ల వయసులో క్రికెట్ కోచింగ్‌ కోసం కోచ్ మనీష్ ఓజా ఆధ్వర్యంలో పాట్నాలోని జెన్నెక్స్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ అతను ఉదయం 7.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ పొందేవాడు. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య ట్యూషన్‌కు వెళ్లి.. ఆ తర్వాత క్రికెట్‌ కోచింగ్‌కు వెళ్లేవాడు. అయితే ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. 2024-25 సెషన్‌కు వైభవ్ సూర్యవన్షీ స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు రూ.2,100, పరీక్ష ఫీజు రూ.800, యాక్టివిటీ ఫీజు రూ.2,400 చెల్లిస్తున్నాడు.

కాగా వైభవ్‌ క్రికెట్‌తో పాటు చదువును కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు. కనీసం టెన్త్‌ పాసై ఆ తర్వాత ఓపెన్‌లో మిగతా చదువు పూర్తి చేద్దామని అనుకుంటున్నాడు. వైభవ్ జనవరి 2024లో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతనికి కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసు మాత్రమే. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత అండర్‌19 మ్యాచ్‌లో కూడా అతను పాల్గొన్నాడు. అందులో 58 బంతుల్లో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న వైభవ్‌.. ఐపీఎల్‌ పూర్తి అవ్వగానే తిరిగి స్కూల్‌ ప్లస్‌ క్రికెట్‌ కోచింగ్‌ కొనసాగించనున్నాడు.